ETV Bharat / state

విశాఖలో వైకాపా భూదందా: ఎమ్మెల్యే రామానాయుడు - వైజాగా భూదందాపై వైకాపా ఎంపీలపై నిమ్మల రామానాయుడు విమర్శలు తాజా వార్తలు

విశాఖ జిల్లాలో వైకాపాకు చెందిన ఎంపీ, ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు భూదందా చేస్తున్నారని.. తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. సూట్​కేసు కంపెనీలతో విజయసాయిరెడ్డి భూములు కొనుగోలు చేయించారని తమ నిజ నిర్ధరణ కమిటీ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.

nimma ramayudu is accusation ycp mps on vizag realestate issue
వైజాగ్​లో మాట్లాడుతున్న తెదేపా నేత నిమ్మల రామానాయుడు
author img

By

Published : Feb 8, 2020, 7:45 PM IST

విశాఖలో మాట్లాడుతున్న తెదేపా నేత నిమ్మల రామానాయుడు

విశాఖ జిల్లాలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న తెదేపా నేతలు విశాఖలో పర్యటించారు. పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్థరణ కమిటీ సభ్యులు.. ప్రజలకు తమ దృష్టికి వచ్చిన విషయాలు వెల్లడించారు. జిల్లాలో వైకాపా నేతలు భూ దందా చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి విజయసాయిరెడ్డికి బినామీగా ఉన్నారని.. భీమిలి పరిసరాల్లో 650 ఎకరాలు కబ్జా చేశారని తెలిపారు. రూ.300 కోట్ల విదేశీ ధనాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారని విమర్శించారు. సూట్ కేసు కంపెనీలతో విజయసాయిరెడ్డి భూములు కొనుగోలు చేయించారని ధ్వజమెత్తారు.

విశాఖలో మాట్లాడుతున్న తెదేపా నేత నిమ్మల రామానాయుడు

విశాఖ జిల్లాలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న తెదేపా నేతలు విశాఖలో పర్యటించారు. పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్థరణ కమిటీ సభ్యులు.. ప్రజలకు తమ దృష్టికి వచ్చిన విషయాలు వెల్లడించారు. జిల్లాలో వైకాపా నేతలు భూ దందా చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి విజయసాయిరెడ్డికి బినామీగా ఉన్నారని.. భీమిలి పరిసరాల్లో 650 ఎకరాలు కబ్జా చేశారని తెలిపారు. రూ.300 కోట్ల విదేశీ ధనాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారని విమర్శించారు. సూట్ కేసు కంపెనీలతో విజయసాయిరెడ్డి భూములు కొనుగోలు చేయించారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.