ETV Bharat / state

Nara Lokesh: రేపు విశాఖ కోర్టుకు హాజరుకానున్న నారా లోకేశ్​

author img

By

Published : Feb 23, 2022, 8:53 PM IST

రేపు విశాఖ కోర్టుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఓ దినపత్రికపై వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు లోకేశ్​ స్వయంగా హాజరుకానున్నారు.

Lokesh
నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. రేపు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రికపై లోకేశ్​ రూ.75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేశ్​ ప్రజాధనంతో రూ. 25 లక్షల చిరుతిళ్లు తిన్నారని ఆ పత్రికలో కథనం ప్రచురితమైంది.

ఆ పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని.. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ.. లోకేశ్​ పేర్కొన్నారు. దీనికి సంబంధించి రూ. 75 కోట్లకు జిల్లా కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం విశాఖ కోర్టుకు లోకేశ్​ స్వయంగా హాజరుకానున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. రేపు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రికపై లోకేశ్​ రూ.75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేశ్​ ప్రజాధనంతో రూ. 25 లక్షల చిరుతిళ్లు తిన్నారని ఆ పత్రికలో కథనం ప్రచురితమైంది.

ఆ పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనని.. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ.. లోకేశ్​ పేర్కొన్నారు. దీనికి సంబంధించి రూ. 75 కోట్లకు జిల్లా కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం విశాఖ కోర్టుకు లోకేశ్​ స్వయంగా హాజరుకానున్నారు.

ఇదీ చదవండి:

TDP district committee meeting : అమరావతినే కాదు రాష్ట్రాన్నే శ్మశానంగా మార్చారు -తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.