'నయానో.. బయానో ప్రజలకు దగ్గరవ్వండి... గెలిచి తీరండి' - వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చోడవరం వార్తలు
ప్రజలను నయానో, భయానో మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలని విశాఖ జిల్లా చోడవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏమి చేస్తారో చేయండి కానీ ఎన్నికల్లో గెలిచి తీరాలని సూచించారు.