ETV Bharat / state

'మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం' - ఎస్పీ అట్టాడ బాబూజీ

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని విశాఖపట్నం ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారన్నారు.

ఎస్పీ అట్టాడ బాబూజీ
author img

By

Published : Apr 12, 2019, 11:01 PM IST

ఎస్పీ అట్టాడ బాబూజీ

విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టులు ఓటింగ్ బహిష్కరించినా గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని చెప్పారు. పోలింగ్ కు ముందు పెదబయలు వద్ద మందుపాతర నిర్వీర్యం చేశామన్నారు. ఈ సారి సాంకేతిక వినియోగంతో పోలింగ్ సురక్షితంగా జరిగిందని... ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారని ఎస్పీ ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్... సాంకేతిక ఇబ్బందులతో రాత్రి 11 గంటల వరకు జరిగినా... ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడం ప్రజల సమష్టి విజయమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 7 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు... 587 మద్యం కేసులు, 11వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఎస్పీ అట్టాడ బాబూజీ

విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టులు ఓటింగ్ బహిష్కరించినా గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని చెప్పారు. పోలింగ్ కు ముందు పెదబయలు వద్ద మందుపాతర నిర్వీర్యం చేశామన్నారు. ఈ సారి సాంకేతిక వినియోగంతో పోలింగ్ సురక్షితంగా జరిగిందని... ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారని ఎస్పీ ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్... సాంకేతిక ఇబ్బందులతో రాత్రి 11 గంటల వరకు జరిగినా... ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడం ప్రజల సమష్టి విజయమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 7 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు... 587 మద్యం కేసులు, 11వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవి చూడండి...

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని అధికారులు తెలిపారు.

ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా చెదురుముదురు సంఘటనల మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
ఉదయం కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్ల అసహనానికి గురయ్యారు. మరి కొన్ని కేంద్రాల వద్ద ఒక గుర్తు పై ఓటు వేస్తే ఇంకొక గుర్తు చూపించడంతో కొద్దిసేపు పోలింగ్ ను నిలిపి వేయడం జరిగింది. ఇంకొన్ని చోట్ల 9 గంటలైనా కూడా పోలింగ్ ప్రారంభించలేదు సరైన ట్రైనింగ్ తీసుకోకపోవడంతో ఈవీఎంలపై సరైన అవగాహన లేదు అన్నట్లు అక్కడ కనిపించింది.

గ్రామాలలో ఓట్లు వేయడానికి అధిక సంఖ్యలో ఓటర్లు హాజరయ్యారు, వికలాంగులకు ప్రత్యేక వాహనంలో ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చి మరి వారి ఇంటి దగ్గరే దింపుతామన్న అధికారులు వారికి ఎటువంటి సౌకర్యాలు చేయలేదని తెలుస్తోంది.

కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద టిడిపి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది.

పోలింగ్ మొత్తం పూర్తయిన తర్వాత అధికారులు ఈవీఎం మిషన్లను ఏజెంట్ల సమక్షంలో భద్రపరిచి వాటికి సీల్ వేయడం జరిగింది.


Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuramu (D)
date : 11-04-2019
sluge : ap_atp_73_11_voters_on_uravakonda_constituency_av_c13
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.