ETV Bharat / state

చెరకు తోటల్లో మిడతలు.. ఆందోళనలో రైతులు

author img

By

Published : Jun 13, 2020, 11:54 AM IST

ఎడారి మిడతలు పంట పొలాలను నాశనం చేస్తున్నాయన్న వార్తతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ మిడతలు కనిపించినా అవేనేమో అని హడలిపోతున్నారు. విశాఖ జిల్లా వీరభద్రపేటలో చెరకు తోటలో వాలిన మిడతల్ని చూసి అన్నదాతలు భయపడ్డారు. అనంతరం అవి సాధారణమైనవే అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Locusts in cheedikada vizag district
చెరకు తోటల్లో మిడతలు

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్రపేట పరిధిలో మిడతలు కనిపించాయి. వీరభద్రపేట, గొప్పరు గ్రామాల్లోని చెరుకు తోటల్లో 2 రోజులుగా ఇవి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒక మొక్కపై ఎక్కువ సంఖ్యలో మిడతలు వాలుతున్నాయని.. చెరకు రేకులను తినేస్తున్నాయని చెప్పారు.

ఎడారి మిడతలేమో అని ఆందోళన చెందిన అన్నదాతలు.. వ్యవసాయ శాఖ ఏవో శ్రీనివాస్​కు సమాచారం అందించారు. ఆయనవచ్చి పరిశీలించి అవి సాధారణంగా వరి పొలాల్లో కనిపించే మిడతలే అని.. ఆందోళన చెందవద్దని రైతన్నలకు సూచించారు.

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వీరభద్రపేట పరిధిలో మిడతలు కనిపించాయి. వీరభద్రపేట, గొప్పరు గ్రామాల్లోని చెరుకు తోటల్లో 2 రోజులుగా ఇవి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒక మొక్కపై ఎక్కువ సంఖ్యలో మిడతలు వాలుతున్నాయని.. చెరకు రేకులను తినేస్తున్నాయని చెప్పారు.

ఎడారి మిడతలేమో అని ఆందోళన చెందిన అన్నదాతలు.. వ్యవసాయ శాఖ ఏవో శ్రీనివాస్​కు సమాచారం అందించారు. ఆయనవచ్చి పరిశీలించి అవి సాధారణంగా వరి పొలాల్లో కనిపించే మిడతలే అని.. ఆందోళన చెందవద్దని రైతన్నలకు సూచించారు.

ఇవీ చదవండి...

'ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.