ETV Bharat / state

అందాల రావికమతం... పర్యటక ప్రాంతంగా మారనుంది..!

author img

By

Published : Nov 30, 2019, 10:05 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయ ప్రకృతి సోయగాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. చుట్టూ పచ్చదనం, ఎటు చూసినా ఆహ్లాదం. ఇంత అందంగా ఉంది కాబట్టే అధికారులు ఈ జలాశయాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Kalyanapuloa reservoir will doevolping as toyurist spot at ravikamatham, visakhapatnam
విశాఖ కళ్యాణపులోవ జలాశయం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి
అందాల రావికమతం... పర్యటక ప్రాంతంగా మారనుంది..!

విశాఖ జిల్లాలోని రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే టూరిజం ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణమూర్తి, అధికారుల బృందం... కళ్యాణపులోవ జలాశయ ప్రాంతాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికతో పాటు పర్యటక స్థలంగా తీర్చిదిద్దుతామని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బోటు షికారు, పిల్లలు ఆడుకోవటానికి పార్కు, రెస్టారెంట్, కాటేజీల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు తొలివిడతగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు.

అందాల రావికమతం... పర్యటక ప్రాంతంగా మారనుంది..!

విశాఖ జిల్లాలోని రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే టూరిజం ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణమూర్తి, అధికారుల బృందం... కళ్యాణపులోవ జలాశయ ప్రాంతాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికతో పాటు పర్యటక స్థలంగా తీర్చిదిద్దుతామని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బోటు షికారు, పిల్లలు ఆడుకోవటానికి పార్కు, రెస్టారెంట్, కాటేజీల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకు తొలివిడతగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:

మన్యం పోలీసుల సేవలకు కేంద్ర ప్రభుత్వ స్కోచ్​ అవార్డులు

Intro:యాంకర్ విశాఖ జిల్లాలోని రావికమతం మండలం కళ్యాణ్పపులోవ జలాశయం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణ మూర్తి వెల్లడించారు టూరిజం శాఖకు చెందిన అధికారుల బృందం కళ్యాణ్ ఫ్లవర్ జలాశయ ప్రాంతాన్ని సందర్శించారు దీనిలో భాగంగా జలాశయం ప్రాంగణంలో ఆధ్యాత్మిక తో పాటు పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం జిల్లా లో పర్యాటక ప్రదేశాలు గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కళ్యాణపులోవ ప్రాంతంలో బోటు షికారు చిన్నపిల్లల పార్క్. రెస్టారెంట్. కాటేజీల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇందుకుగాను తొలి విడతగా కోటి రూపాయల తో ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. బైట్ రాధాకృష్ణ మూర్తి ( ప్రాంతీయ సంచాలకులు ఏ. పీ టూరిజం, విశాఖపట్నం)


Body:NARSIPATNAM


Conclusion:8008574736

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.