ETV Bharat / state

జుత్తాడ హత్యల్లో ట్విస్ట్​..అప్పలరాజు ఒక్కడే చంపలేదన్న మృతుల బంధువులు - మంత్రి అవంతి, విశాఖ కలెక్టర్​ను కలిసిన జుత్తాడ మృతుల బంధువులు

జుత్తాడ హత్యోదంతంలో మొత్తం ఏడుగురి హస్తం ఉందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. విశాఖ కలెక్టర్, మంత్రి అవంతిని కలిసి.. ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడు అప్పలరాజును కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

juthada victims family met minister avanti, visakha collector, juthada victims demands
మంత్రి అవంతి, విశాఖ కలెక్టర్​ను కలిసిన జుత్తాడ బాధితులు, జుత్తాడ మృతుల బంధువుల డిమాండ్లు
author img

By

Published : Apr 19, 2021, 7:11 PM IST

Updated : Apr 19, 2021, 8:18 PM IST

నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న మృతుల బంధువులు

విశాఖ జిల్లా జుత్తాడ హత్యాకాండలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన ఘటనలో మొత్తం ఏడుగురి హస్తం ఉందని బాధితుడు విజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఫాస్ట్​ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాసరావు, కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. ధన ప్రభావంతో నిందితుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాడని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

తన కుమార్తెపై అత్యాచారం చేసినందుకు అందరినీ హత్య చేశానని చెప్తున్న అప్పలరాజు.. పగ ఉంటే తనపై నేరుగా తీర్చుకోవాలి కానీ కుటుంబం ఏం చేసిందని బాధితుడు విజయ్ ప్రశ్నించాడు. ఈ హత్యోదంతంలో ప్రమేయం ఉన్న ఏడుగురినీ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో నెలలో జరగనున్న పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన తన తల్లిని చంపడం దారుణమని మృతురాలు రమాదేవి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

పథకం సిద్ధంగా ఉంది.. నత్త నడకన పైప్​లైన్ పనులు

నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న మృతుల బంధువులు

విశాఖ జిల్లా జుత్తాడ హత్యాకాండలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన ఘటనలో మొత్తం ఏడుగురి హస్తం ఉందని బాధితుడు విజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఫాస్ట్​ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాసరావు, కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. ధన ప్రభావంతో నిందితుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాడని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

తన కుమార్తెపై అత్యాచారం చేసినందుకు అందరినీ హత్య చేశానని చెప్తున్న అప్పలరాజు.. పగ ఉంటే తనపై నేరుగా తీర్చుకోవాలి కానీ కుటుంబం ఏం చేసిందని బాధితుడు విజయ్ ప్రశ్నించాడు. ఈ హత్యోదంతంలో ప్రమేయం ఉన్న ఏడుగురినీ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో నెలలో జరగనున్న పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన తన తల్లిని చంపడం దారుణమని మృతురాలు రమాదేవి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

పథకం సిద్ధంగా ఉంది.. నత్త నడకన పైప్​లైన్ పనులు

Last Updated : Apr 19, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.