పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామపంచాయతీలో ఘర్షణ జరిగింది. విజయలక్ష్మి అనే మహిళ ఏడు ఓట్లతో విజయం సాధించినా.. రెండుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. వైకాపా వర్గీయులు గొడవ పెట్టుకుని బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెల్లెందుకు ప్రయత్నించారు. వారిని అధికారులు అడ్డుకొన్నారు. జనసేన మద్దతుదారురాలైన విజయలక్ష్మి విజయం సాధించిందని అధికారులు ప్రకటించారు. అయితే డిక్లరేషన్ ఫారం మాత్రం అధికారులు ఇవ్వలేదు. దీంతో జనసేన కార్యకర్తలు కౌంటింగ్ హాల్ ముందు ధర్నా చేపట్టారు. వైకాపా వర్గీయులు బ్యాలెట్ పత్రాలను తీసుకెళ్లిపోయారని జనసేన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఫలితం: విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు