తెదేపా నేతల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఐటీ దాడులు నిరసనగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బంగారయ్య మరికొంత మందితో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల్లో వైకాపాకు భాజపాకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.
ఇవి చదవండి