విశాఖ జిల్లా చీడికాడ మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా సాగుతోంది. చీడికాడ-మంచాల మార్గంలోని మెట్ట దిగువన పొక్లెయిన్తో తవ్వి.. నిరంతరం పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో గ్రావెల్ దర్జాగా తరలిస్తున్నారు. శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావటంతో అక్రమార్కులు గ్రావెల్ను పొక్లెయిన్తో తవ్వి.. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.
రెండు రోజులుగా గ్రావెల్ను తవ్వుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆరోపించారు. మంచాల మార్గంలోని మెట్ల వద్ద అడవి అగ్రహారం, బైలపూడి ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ను తవ్వుతున్నట్లు వివరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: వర్షం కురవాలని లక్కవరంలో పూజలు