విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 140 కిలోల గంజాయిని గుర్తించారు. జిల్లాలోని కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామానికి చెందిన కుప్పం అచ్యుతరావు అనే వ్యక్తి.. కారులో గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. దీని విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని మాకవరపాలెం పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసిన పోలీసులు.. నిందితునికి గంజాయి ఎవరు విక్రయించారు? ఎక్కడ కొనుగోలు చేశారు? తదితర వివరాలను సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:
గుంటూరులోని ఆలయంలో చోరీ...కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు