ETV Bharat / state

జనసేన నేతలకు బెయిల్​.. సంతోషం వ్యక్తం చేసిన పవన్​కల్యాణ్​

author img

By

Published : Oct 21, 2022, 4:56 PM IST

BAIL TO JANASENA LEADERS : విశాఖ ఎయిర్​పోర్టులో వైకాపా మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో అరెస్టైన జనసేన నేతలకు బెయిల్​ మంజూరు అయ్యింది. బెయిల్​ మంజూరు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

BAIL TO JANASENA LEADERS
BAIL TO JANASENA LEADERS

BAIL TO JANSENA ACTIVISTS : విశాఖ ఎయిర్​పోర్ట్ ఘటనలో అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైకాపా మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో 70మంది జనసేన నేతలపై విశాఖ పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అంతకుముందు 61 మందికి బెయిల్​ మంజూరు కాగా 9మందికి దిగువ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన జనసేన నేతలు విశాఖ కారాగారంలో ఉన్నారు.

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సంతోషకరం: జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ మండిపడ్డారు. పార్టీ నేతలకు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను తామేప్పుడు సంపూర్ణంగా విశ్వసిస్తామని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ జరిగింది : విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైకాపాకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్​కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.

ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు.. పోలీసుల అభ్యర్థన మేరకు వారిని రెండురోజుల పాటు న్యాయవాదుల సమక్షంలో పోలీసు కస్టడీకి అనుమతించింది.

ఇవీ చదవండి:

BAIL TO JANSENA ACTIVISTS : విశాఖ ఎయిర్​పోర్ట్ ఘటనలో అరెస్ట్ అయిన 9 మంది జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైకాపా మంత్రులపై దాడి చేశారనే ఆరోపణలతో 70మంది జనసేన నేతలపై విశాఖ పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అంతకుముందు 61 మందికి బెయిల్​ మంజూరు కాగా 9మందికి దిగువ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన జనసేన నేతలు విశాఖ కారాగారంలో ఉన్నారు.

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సంతోషకరం: జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ మండిపడ్డారు. పార్టీ నేతలకు బెయిల్‌ మంజూరు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను తామేప్పుడు సంపూర్ణంగా విశ్వసిస్తామని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ జరిగింది : విశాఖ గర్జన పేరిట ఉత్తరాంధ్ర జేఏసీ విశాఖలో చేపట్టిన కార్యక్రమానికి వైకాపా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మంత్రులు, వైకాపాకు చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్​కు స్వాగతం చెప్పేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసైనికులు.. విశాఖ గర్జన ముగించుకుని వెళ్తున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్, వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి దిగారు.

ఈ ఘటనలో పోలీసులు 70 మంది జన సైనికులను అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా.. అరెస్టయిన వారిలో 61 మంది నిందితులకు అక్కడికక్కడే బెయిల్ లభించింది. మిగిలిన 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 9 మంది తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో పాటు.. పోలీసుల అభ్యర్థన మేరకు వారిని రెండురోజుల పాటు న్యాయవాదుల సమక్షంలో పోలీసు కస్టడీకి అనుమతించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.