ETV Bharat / state

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు... నిండుకుండల్లా జలాశయాలు

author img

By

Published : Oct 14, 2020, 5:58 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం జిల్లా తడిసి ముద్దయింది. జిల్లాలోని నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులపై నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

heavy water storage in dams with heavy rains at vizag district
విశాఖ జిల్లాలో కుండపోత... నిండుకుండల్లా జలాశయాలు

భారీ వర్షంతో విశాఖ జిల్లాలోని నదులు ఉగ్రరూపం దాల్చాయి. చోడవరం- మాడుగుల నియోజకవర్గాల్లోని శారదా, పెద్దేరు, బొడ్డేరు, వరాహ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో 4 జలాశయాలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలు భయం, భయంగా గడుపుతున్నారు. భోగాపురం, లక్కవరం, చాకిపల్లి, పీఎస్ పేట, జన్నవరం వద్ద గండ్లు పడి రహదారులపై వరద నీరు రావడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

విశాఖ జిల్లాలో కుండపోత... నిండుకుండల్లా జలాశయాలు

ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. రైవాడ, పెద్దేరు, కోనాం ప్రధాన జలాశయాల నుంచి వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయంలోకి ఇన్ ఫ్లో 4,084 క్యూసెక్కులు రాగా.. 8,840 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదులుతున్నారు. పెద్దేరు జలాశయంలోకి ఇన్ ఫ్లో 2,315 క్యూసెక్కులు వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

విశాఖ జిల్లాలో కుండపోత... నిండుకుండల్లా జలాశయాలు

రాంబిల్లి మండలంలో వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజకోడూరు, కొత్తపాలెం ప్రాంతంలో వరి పొలాలు నీట మునిగాయి. ఖరీఫ్ తుది దశలో ఉన్న పంట ముంపులో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు చోడవరంలో వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీటమునిగాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపైనా నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చోడవరం నుంచి చాకిపల్లి, సింహాద్రిపురం వెళ్లే మార్గాలన్నీ జలమయమయ్యాయి.

ఇదీ చదవండి:

నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

భారీ వర్షంతో విశాఖ జిల్లాలోని నదులు ఉగ్రరూపం దాల్చాయి. చోడవరం- మాడుగుల నియోజకవర్గాల్లోని శారదా, పెద్దేరు, బొడ్డేరు, వరాహ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటితో 4 జలాశయాలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంత ప్రజలు భయం, భయంగా గడుపుతున్నారు. భోగాపురం, లక్కవరం, చాకిపల్లి, పీఎస్ పేట, జన్నవరం వద్ద గండ్లు పడి రహదారులపై వరద నీరు రావడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

విశాఖ జిల్లాలో కుండపోత... నిండుకుండల్లా జలాశయాలు

ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది. రైవాడ, పెద్దేరు, కోనాం ప్రధాన జలాశయాల నుంచి వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయంలోకి ఇన్ ఫ్లో 4,084 క్యూసెక్కులు రాగా.. 8,840 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి వదులుతున్నారు. పెద్దేరు జలాశయంలోకి ఇన్ ఫ్లో 2,315 క్యూసెక్కులు వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

విశాఖ జిల్లాలో కుండపోత... నిండుకుండల్లా జలాశయాలు

రాంబిల్లి మండలంలో వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజకోడూరు, కొత్తపాలెం ప్రాంతంలో వరి పొలాలు నీట మునిగాయి. ఖరీఫ్ తుది దశలో ఉన్న పంట ముంపులో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు చోడవరంలో వందల ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీటమునిగాయి. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపైనా నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చోడవరం నుంచి చాకిపల్లి, సింహాద్రిపురం వెళ్లే మార్గాలన్నీ జలమయమయ్యాయి.

ఇదీ చదవండి:

నడికుడి రసాయన ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.