fire accident in visakha : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినతీనార్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున్న ఎగసిపడిన మంటలు చూసి.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి రెండు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని.. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి: వేరొకర్ని పెళ్లాడుతుందని ఆమెకు నిప్పంటించి.. తానూ మంటల్లో కాలి..