ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో చిలుకు ద్వాదశి ఉత్సవం

author img

By

Published : Nov 28, 2020, 12:35 PM IST

కార్తిక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. సింహాచలం సింహాద్రి అప్పన్న గుడిలో ద్వాదశి ఉత్సవం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది.

dwadasi celebration
సింహాద్రిలో ద్వాదశి ఉత్సవం

విశాఖ జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చిలుకు ద్వాదశి ఉత్సవం నిర్వహించారు. ఏటా కార్తిక మాసంలో ద్వాదశినాడు ఈ కార్యక్రమం చేయటం ఆనవాయితీ. స్వామివారి సన్నిధిలో చెరుకు గడలతో రోలులో దంచి.. ప్రసాదాన్ని తయారు చేసి నివేదిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు పారాయణం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

సింహాద్రిలో చిలుకు ద్వాదశి ఉత్సవం

ఇదీ చదవండి: శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు విడుదల

విశాఖ జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చిలుకు ద్వాదశి ఉత్సవం నిర్వహించారు. ఏటా కార్తిక మాసంలో ద్వాదశినాడు ఈ కార్యక్రమం చేయటం ఆనవాయితీ. స్వామివారి సన్నిధిలో చెరుకు గడలతో రోలులో దంచి.. ప్రసాదాన్ని తయారు చేసి నివేదిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు పారాయణం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

సింహాద్రిలో చిలుకు ద్వాదశి ఉత్సవం

ఇదీ చదవండి: శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.