ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: పర్యటకం ఊసు లేదు.. ఉపాధి జాడ లేదు

author img

By

Published : Sep 30, 2020, 2:58 PM IST

పర్యటక రంగాన్ని కొవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి. ఈ రంగాన్ని నమ్ముకున్న వారిపై మహమ్మారి గుదిబండగా మారింది. సుదీర్ఘ తీర ప్రాంతం.. ఎన్నో పర్యటక విశిష్టతలు కలిగిన మన రాష్టంలో చూస్తే పర్యటక రంగం నష్టం వేల కోట్ల రూపాయల్లోనే ఉంది. అంతర్జాతీయ పర్యటకానికి అవకాశాలు లేక.. దేశీయ పర్యటకమూ సాగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ రంగంలో 90 శాతం మేర ఉద్యోగాలపై కోత పడిందంటే ఎంతటి గడ్డు పరిస్థితి నెలకొందే అర్థం అవుతోంది.

covid effect on tourism in ap state
పర్యటక రంగంపైన కరోనా ప్రభావం

కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాల కంటే ముందుగా దెబ్బతిన్న వాటిలో పర్యటకం ఒకటని చెప్పాలి. కొవిడ్ ప్రారంభమైన రోజుల నుంచే అంతర్జాతీయ పర్యటకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా టూర్ ఆపరేటర్లు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. జనవరి నుంచి ప్రారంభమైన పతనం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయం అర్థం కాక పర్యటక ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. మన రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది వరకు టూర్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత్​లో ఉన్న కొవిడ్ కేసుల ప్రభావంతో విదేశీ పర్యటకాన్ని ఇప్పట్లో ఆశించలేమని వారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని దేశీయ పర్యటకాన్ని అయినా ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని వారు కోరుతున్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యటకుల కోసం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. వెబ్​సైట్​లో వివరాలు నమోదు చేసుకున్న వారికి ఆయా రాయితీలు వర్తించేలా విధానాన్ని రూపొందించింది. అదే తరహాలో ఇతర రాష్ట్రాలు చర్యలు చేపట్టి దేశీయ పర్యటకాన్ని ప్రోత్సహిస్తే ఈ రంగంపై ఆధారపడిన లక్షల మందికి తిరిగి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. టెంపుల్ టూరిజంకు ప్రస్తుతం ఆదరణ బాగానే ఉన్నందున దీనిపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆపరేటర్లు కోరుతున్నారు. సీజనల్ టూరిజంను కోల్పోకుండా ముందస్తు అప్రమత్తతతో విధానాన్ని రూపొందించాలని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున... కొవిడ్ నిబంధనలు, సురక్షిత చర్యల గురించి మెరుగైన అవగాహన కల్పిస్తే స్థానిక పర్యటకానికి ప్రాధాన్యత ఆదరణ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

లాటరీ ఆశ చూపి..రూ. 21 లక్షలు స్వాహా

కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అన్ని రంగాల కంటే ముందుగా దెబ్బతిన్న వాటిలో పర్యటకం ఒకటని చెప్పాలి. కొవిడ్ ప్రారంభమైన రోజుల నుంచే అంతర్జాతీయ పర్యటకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా టూర్ ఆపరేటర్లు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. జనవరి నుంచి ప్రారంభమైన పతనం ఎప్పటి వరకు కొనసాగుతుందనే విషయం అర్థం కాక పర్యటక ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. మన రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది వరకు టూర్ ఆపరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం భారత్​లో ఉన్న కొవిడ్ కేసుల ప్రభావంతో విదేశీ పర్యటకాన్ని ఇప్పట్లో ఆశించలేమని వారు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుని దేశీయ పర్యటకాన్ని అయినా ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని వారు కోరుతున్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యటకుల కోసం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. వెబ్​సైట్​లో వివరాలు నమోదు చేసుకున్న వారికి ఆయా రాయితీలు వర్తించేలా విధానాన్ని రూపొందించింది. అదే తరహాలో ఇతర రాష్ట్రాలు చర్యలు చేపట్టి దేశీయ పర్యటకాన్ని ప్రోత్సహిస్తే ఈ రంగంపై ఆధారపడిన లక్షల మందికి తిరిగి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. టెంపుల్ టూరిజంకు ప్రస్తుతం ఆదరణ బాగానే ఉన్నందున దీనిపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆపరేటర్లు కోరుతున్నారు. సీజనల్ టూరిజంను కోల్పోకుండా ముందస్తు అప్రమత్తతతో విధానాన్ని రూపొందించాలని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున... కొవిడ్ నిబంధనలు, సురక్షిత చర్యల గురించి మెరుగైన అవగాహన కల్పిస్తే స్థానిక పర్యటకానికి ప్రాధాన్యత ఆదరణ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవీ చదవండి:

లాటరీ ఆశ చూపి..రూ. 21 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.