ETV Bharat / state

పది రోజుల్లో ఇద్దరు చిన్నారుల మృతి.. ఆందోళనలో గ్రామస్థులు

author img

By

Published : Nov 25, 2020, 5:56 AM IST

ఆ గిరిజన గ్రామంలో ఇద్దరు చిన్నారులు.. పది రోజుల వ్యవధిలో మృతి చెందారు. ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లలు ఎందుకు మృత్యువాత పడ్డారో తెలియక.. గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా బలిపురం గిరిజన గ్రామంలో జరిగింది.

children's Suspected death at Balipuram
పదిరోజుల్లో ఇద్దరు చిన్నారుల మృతి.. ఆందోళనలో గ్రామస్థులు

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం బలిపురం గిరిజన గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు.. పది రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితం కాకర కుమార్ (4) మృతి చెందగా.. తాజాగా 7 నెలల బాలుడు ప్రాణం విడిచాడు.

ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లలు ఉన్నఫళంగా మరణిస్తుండడం.. గ్రామస్థులను కలవరపరుస్తోంది. ఘటనకు కారణాలపై విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం బలిపురం గిరిజన గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు.. పది రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితం కాకర కుమార్ (4) మృతి చెందగా.. తాజాగా 7 నెలల బాలుడు ప్రాణం విడిచాడు.

ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లలు ఉన్నఫళంగా మరణిస్తుండడం.. గ్రామస్థులను కలవరపరుస్తోంది. ఘటనకు కారణాలపై విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.

ఇదీ చదవండి:

దూసుకొస్తున్న నివర్...ఎటు వెళ్తుందంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.