ETV Bharat / state

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో వింత వ్యాధితో పశువులు మృతి

author img

By

Published : Feb 4, 2021, 6:47 PM IST

విశాఖ జిల్లా దబ్బగురువు గ్రామంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. విషయం తెలుసుకున్న పాడేరు పశువైద్యాధికారిణి హన్నాకుమారి గ్రామాన్ని సందర్శించి...మృతి చెందిన పశువులను పరిశీలించారు.

మృతి చెందిన పశువులు
మృతి చెందిన పశువులు

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని దబ్బగురువు గ్రామంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రైతులు అందించిన సమాచారం మేరకు... పాడేరు పశు వైద్య అధికారిని హన్నాకుమారి..నలుగురు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మృతిచెందిన పశువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎర్రబస్తార్ ఆకులను తినడం వల్లే ఈ పశువులు మృతి చెందాయని తెలిపారు. అంతేగాక కలుషిత నీరు తాగి ఏడాదిలో వందలాది పశువులు మృత్యువాత పడుతుంటాయన్నారు. అయితే పశువులను కోల్పోయిన రైతులు నష్టపరిహారం పోందలేకపోతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న సచివాలయంలో పశు వైద్య సిబ్బందిని సంప్రదిస్తే... నష్టపరిహారం త్వరగా వస్తుందని హన్నాకుమారి వెల్లడించారు.

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని దబ్బగురువు గ్రామంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రైతులు అందించిన సమాచారం మేరకు... పాడేరు పశు వైద్య అధికారిని హన్నాకుమారి..నలుగురు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మృతిచెందిన పశువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఎర్రబస్తార్ ఆకులను తినడం వల్లే ఈ పశువులు మృతి చెందాయని తెలిపారు. అంతేగాక కలుషిత నీరు తాగి ఏడాదిలో వందలాది పశువులు మృత్యువాత పడుతుంటాయన్నారు. అయితే పశువులను కోల్పోయిన రైతులు నష్టపరిహారం పోందలేకపోతున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్న సచివాలయంలో పశు వైద్య సిబ్బందిని సంప్రదిస్తే... నష్టపరిహారం త్వరగా వస్తుందని హన్నాకుమారి వెల్లడించారు.

ఇదీ చదవండి

అదుపుతప్పి బోల్తా పడిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.