ఆరు నెలలపాటు డిపోలకు పరిమితమైన బస్సులు కదులుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ అనుమతితో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మొదలయ్యాయి. శుక్రవారం రోజున విశాఖ ద్వారక బస్ కాంప్లెక్స్ నుంచి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఉదయం నాలుగు గంటలకు గునుపూర్, 4:30 గంటలకు నవరంగ్పూర్, 5 గంటలకు ఒనకఢిల్లీ, 7 గంటలకు పర్లా కిమిడి, మధ్యాహ్నం 1:45కి థమన్ జోడి, 2:30 నిమిషాలకు జైపూర్, తిరిగి రాత్రి 8:30 నిమిషాలకు ఇంద్రావతి సర్వీసులు నడపడానికి నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కలిపిస్తోంది. శుక్రవారం రోజున ఆంధ్ర-ఒడిశా మధ్య బస్సు సర్వీసులను తిప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ ఆర్టీసీ అధికారులు.
ఇదీ చూడండి. ప్రజల మనోభావాలతో సీఎం జగన్ ఆటలాడుతున్నారు: చంద్రబాబు