విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం విశాఖలోని ఓ నివాసంలో నిల్వ ఉంచిన 360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి బస్సు, రైలు మార్గాల్లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన కేరళకు చెందిన అలెక్స్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఒడిశా, కేరళకు చెందిన కొందరు విశాఖ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాల వ్యాపారం నడుపుతున్నట్లు పోలీసులు వివరించారు.ఇదీ చదవండి:
కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం