ETV Bharat / state

Mission Amruth: అమృత్​ పథకంలో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు - Chandrasekhar as National Nodal in-charge of Amrut 2.0 Scheme

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్​ 2.0 పథకంలో తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. అమృత్​ పథకం తెలుగు రాష్ట్రాల నేషనల్​ నోడల్​ ఇంఛార్జ్​గా డా. బుద్ధ చంద్రశేఖర్​ అదనపు బాధ్యతలు చేపట్టారు.

నేషనల్​ నోడల్​ ఇంఛార్జ్​గా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్
నేషనల్​ నోడల్​ ఇంఛార్జ్​గా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్
author img

By

Published : Feb 4, 2022, 5:36 PM IST

Updated : Feb 4, 2022, 8:14 PM IST

Buddha Chandrasekhar: అమృత్ 2.0 పథకం లక్ష్య సాధనకు తెలుగు రాష్ట్రాలల్లో నేషనల్ నోడల్ ఇంఛార్జ్​గా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్​ అదనపు బాధ్యతలు చేపట్టారు. అమృత్ 2.0 సాఫ్ట్​వేర్​ అప్లికేషన్ రూపొందించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసీటీఈలో చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్​గా చంద్రశేఖర్ విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన చంద్రశేఖర్.. భారతీయ మాతృభాషల సంరక్షణకు ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ట్రాన్స్​లేషన్​ టూల్ కిట్ రూపకర్త. తెలుగు రాష్ట్రాలకు అధికారిగా రావడం గమనార్హం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే.. తెలుగురాష్ట్రాలల్లో అమృత్ 2.0 లక్ష్య సాధనకు నేషనల్ నోడల్ ఇంచార్జ్ ఆఫీసర్​గా తెలుగు వ్యక్తిని ఎంపిక చేశారు.

100 శాతం పట్టణ మంచినీరు అందించాలనే

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి మంచినీరు(కుళాయి నీరు) అమృత్ 2.0 పథకం.. 2015లో మొదటి నీటి కేంద్రీకృత మిషన్​గా ప్రారంభమైంది. 500 ప్రధాన నగరాలలో 60% మందికి ఉపయోగపడేలా రూ. లక్ష కోట్ల ఈ పథకాన్ని రూపొందించారు. ప్రాజెక్టు అమలు కోసం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ విలువైన పనులు జరుగుతుండటం గమనార్హం. అమృత్ 2.0 పథకం ప్రకారం.. "మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని 'అభివృద్ధి చేయాలనే సంకల్పం'.. శుద్ధి చేసిన నీటిని సద్వినియోగం కోసం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అమృత్ 2.0 లక్ష్యం 2.68 కోట్ల పట్టణ గృహాలకు కులాయి కనెక్షన్లు అందించడం. 100% యూఎల్​బీలలోని అన్ని గ్రహాలకు నీటిని సరఫరా చేయడం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదీ చదవండి..HC on Amaravathi: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభం

Buddha Chandrasekhar: అమృత్ 2.0 పథకం లక్ష్య సాధనకు తెలుగు రాష్ట్రాలల్లో నేషనల్ నోడల్ ఇంఛార్జ్​గా డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్​ అదనపు బాధ్యతలు చేపట్టారు. అమృత్ 2.0 సాఫ్ట్​వేర్​ అప్లికేషన్ రూపొందించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐసీటీఈలో చీప్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్​గా చంద్రశేఖర్ విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన చంద్రశేఖర్.. భారతీయ మాతృభాషల సంరక్షణకు ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ ట్రాన్స్​లేషన్​ టూల్ కిట్ రూపకర్త. తెలుగు రాష్ట్రాలకు అధికారిగా రావడం గమనార్హం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే.. తెలుగురాష్ట్రాలల్లో అమృత్ 2.0 లక్ష్య సాధనకు నేషనల్ నోడల్ ఇంచార్జ్ ఆఫీసర్​గా తెలుగు వ్యక్తిని ఎంపిక చేశారు.

100 శాతం పట్టణ మంచినీరు అందించాలనే

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి మంచినీరు(కుళాయి నీరు) అమృత్ 2.0 పథకం.. 2015లో మొదటి నీటి కేంద్రీకృత మిషన్​గా ప్రారంభమైంది. 500 ప్రధాన నగరాలలో 60% మందికి ఉపయోగపడేలా రూ. లక్ష కోట్ల ఈ పథకాన్ని రూపొందించారు. ప్రాజెక్టు అమలు కోసం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ విలువైన పనులు జరుగుతుండటం గమనార్హం. అమృత్ 2.0 పథకం ప్రకారం.. "మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని 'అభివృద్ధి చేయాలనే సంకల్పం'.. శుద్ధి చేసిన నీటిని సద్వినియోగం కోసం ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అమృత్ 2.0 లక్ష్యం 2.68 కోట్ల పట్టణ గృహాలకు కులాయి కనెక్షన్లు అందించడం. 100% యూఎల్​బీలలోని అన్ని గ్రహాలకు నీటిని సరఫరా చేయడం. 100 శాతం పట్టణ ప్రాంతాలను మంచినీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదీ చదవండి..HC on Amaravathi: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభం

Last Updated : Feb 4, 2022, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.