ETV Bharat / state

త్వరలోనే... విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు

author img

By

Published : Jan 20, 2020, 6:40 AM IST

దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి బీఎస్​ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులను ప్రారంభించనుందని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ వెల్లడించారు. త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్న ఈ సర్వీసులకు సంబంధించిన అంశాలపై సంస్థకు సంబంధించిన పలువురు అధికారులు చర్చించారు.

bsnl companey tie up with a private companey and it will launching a triple play services soon in visakhapatnam
విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు
విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు

దేశంలోనే తొలిసారిగా బీఎస్ఎన్ఎల్ ఒక ప్రైవేటు భాగస్వామితో కలసి ట్రిపుల్ ప్లే సర్వీసులను త్వరలోనే విశాఖలో అందిస్తోందని.. బీఎస్ఎన్ఎల్ డైరక్టర్ వివేక్ బంజాల్ వెల్లడించారు. విశాఖలోని ఎస్​డీవీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినియోగదార్లకు మంచి సేవలను అందించటం, వేగంగా కనెక్షన్లు ఇవ్వడం వంటి వాటిపై సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా చూడాలని సూచనలు ఇచ్చారు. ఫోన్- నెట్- కేబుల్ సర్వీసులు ఒకే ప్యాకేజిలో అందిస్తున్నామని వివేక్ చెప్పారు. ఆరు జిల్లాల్లో ఆరు లక్షల మంది వినియోగదార్లకు ఎస్​డీవీతో కలిసి ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందుకు కావాల్సిన సాంకేతిక సహకారం అంతా బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో అమలవుతున్న ఈ మోడల్ విజయవంతం అవుతుందని రాష్ట్ర టెలికాం సర్కిల్ సీజీఎం వీవీఎస్ రాఘవ కుమార్ వివరించారు. వినియోగదార్లందరికి ఉపయుక్తంగా ఈ ప్యాకేజిని తీర్చిదిద్దామని ఎస్​డీవీ ఛైర్మన్ ఇసుకపల్లి రామకృష్ణంరాజు తెలిపారు.
ఇదీ చదవండి:

గిరిజన సంప్రదాయంలో జాయింట్ కలెక్టర్ దంపతుల పెళ్లి

విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు

దేశంలోనే తొలిసారిగా బీఎస్ఎన్ఎల్ ఒక ప్రైవేటు భాగస్వామితో కలసి ట్రిపుల్ ప్లే సర్వీసులను త్వరలోనే విశాఖలో అందిస్తోందని.. బీఎస్ఎన్ఎల్ డైరక్టర్ వివేక్ బంజాల్ వెల్లడించారు. విశాఖలోని ఎస్​డీవీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినియోగదార్లకు మంచి సేవలను అందించటం, వేగంగా కనెక్షన్లు ఇవ్వడం వంటి వాటిపై సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా చూడాలని సూచనలు ఇచ్చారు. ఫోన్- నెట్- కేబుల్ సర్వీసులు ఒకే ప్యాకేజిలో అందిస్తున్నామని వివేక్ చెప్పారు. ఆరు జిల్లాల్లో ఆరు లక్షల మంది వినియోగదార్లకు ఎస్​డీవీతో కలిసి ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందుకు కావాల్సిన సాంకేతిక సహకారం అంతా బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో అమలవుతున్న ఈ మోడల్ విజయవంతం అవుతుందని రాష్ట్ర టెలికాం సర్కిల్ సీజీఎం వీవీఎస్ రాఘవ కుమార్ వివరించారు. వినియోగదార్లందరికి ఉపయుక్తంగా ఈ ప్యాకేజిని తీర్చిదిద్దామని ఎస్​డీవీ ఛైర్మన్ ఇసుకపల్లి రామకృష్ణంరాజు తెలిపారు.
ఇదీ చదవండి:

గిరిజన సంప్రదాయంలో జాయింట్ కలెక్టర్ దంపతుల పెళ్లి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.