ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి

author img

By

Published : Feb 26, 2020, 7:59 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో విషాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన నంబారు వెంకటేశ్​ చీడికాడ విద్యుత్ ఉప కేంద్రంలో షిఫ్ట్ ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగిసిన అనంతరం ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

BIKE ACCIDENT IN VIZAG DISTRICT
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి
చెట్టును ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో యువకుని మృతి

చెట్టును ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో యువకుని మృతి

ఇదీ చదవండి:

నూక తాత జాతర... ఆ పాదం తాకితే నిజమైన సంబరం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.