ఇదీ చదవండి:
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి
విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో విషాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన నంబారు వెంకటేశ్ చీడికాడ విద్యుత్ ఉప కేంద్రంలో షిఫ్ట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగిసిన అనంతరం ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
చెట్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. యువకుడు మృతి