ETV Bharat / state

టిడ్కో గృహ నిర్మాణాల రద్దు.. ఆందోళనలో లబ్ధిదారులు

author img

By

Published : Dec 8, 2020, 1:42 PM IST

తెదేపా హయాంలో చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను నేటికీ అధికారులు సిద్ధం చేయలేకపోతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్లాట్లను అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

tidco houses
టిడ్కో గృహ నిర్మాణాల రద్దు

తెదేపా ప్రభుత్వ హయాంలో జీ ప్లస్ త్రీ గృహాల నిర్మాణం నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గృహ పత్రాలు అందజేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కరక రోడ్డు సమీపంలో 2,448 ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 624 ప్లాట్లు నేటికీ పునాది స్థాయిలోనే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అకారణంగా రద్దు చేసింది. డిపాజిట్లు చెల్లించిన వారికి డబ్బులు వాపస్ చేసి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.

రద్దైన 624 ప్లాట్లలోని జాబితాలో అర్హులు ఉంటేనే స్థలం మంజూరు చేస్తారని లేనిపక్షంలో డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జరిపిన సర్వేలో సుమారు రెండు వందల మంది పైగా అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించ లేదు. గతంలో అర్హులుగా గుర్తించి గృహ మంజూరు పత్రాలు ఇచ్చి.. ఇప్పుడు అనర్హులుగా ఎలా పరిగణిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తెదేపా నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో వినతి పత్రం అందజేసి తమ గోడును విన్నవించారు. ఈ గృహ సముదాయంలో 80 శాతం నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసే వరకు పోరాటం'

తెదేపా ప్రభుత్వ హయాంలో జీ ప్లస్ త్రీ గృహాల నిర్మాణం నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గృహ పత్రాలు అందజేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని కరక రోడ్డు సమీపంలో 2,448 ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 624 ప్లాట్లు నేటికీ పునాది స్థాయిలోనే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అకారణంగా రద్దు చేసింది. డిపాజిట్లు చెల్లించిన వారికి డబ్బులు వాపస్ చేసి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.

రద్దైన 624 ప్లాట్లలోని జాబితాలో అర్హులు ఉంటేనే స్థలం మంజూరు చేస్తారని లేనిపక్షంలో డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జరిపిన సర్వేలో సుమారు రెండు వందల మంది పైగా అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించ లేదు. గతంలో అర్హులుగా గుర్తించి గృహ మంజూరు పత్రాలు ఇచ్చి.. ఇప్పుడు అనర్హులుగా ఎలా పరిగణిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తెదేపా నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో వినతి పత్రం అందజేసి తమ గోడును విన్నవించారు. ఈ గృహ సముదాయంలో 80 శాతం నిర్మాణ పనులు పూర్తి కాగా.. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసే వరకు పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.