ఏపీ ఆదర్శ పాఠశాలల్లో.. ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్స్) 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థులు www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 10 నుంచి జూన్ నెలాఖరు వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చలానా ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఆయా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు: ఆనందయ్య