ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

author img

By

Published : Oct 5, 2020, 7:14 PM IST

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో విశాఖపట్నం జిల్లా మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థ విద్యార్థులు ప్రతిభ చాటారు. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్లో ముగ్గురు... అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

andhrapradhesh-tribal-welfare-gurukul-training-center-students-got-rankings-in-jee-advanced-2020
జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న టి .మత్యలింగం జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 113 వ ర్యాంకు, పాడేరు మండలం జోడుమామిడి గ్రామానికి చెందిన శ్రీను... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 1,116వ ర్యాంకు సాధించారు.

గూడెం కొత్తవీధి మండలం దారకొండ కొత్తూరు గ్రామానికి చెందిన ఎస్.నాని ప్రసాద్... ఎస్టీ పిడబ్ల్యూడి కేటగిరిలో 12వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురూ జేఈఈ అడ్వాన్స్​డ్​లో ర్యాంకులు సాధించడంపై శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఎల్.శివ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న టి .మత్యలింగం జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 113 వ ర్యాంకు, పాడేరు మండలం జోడుమామిడి గ్రామానికి చెందిన శ్రీను... ఎస్టీ కేటగిరిలో ఆల్ ఇండియా 1,116వ ర్యాంకు సాధించారు.

గూడెం కొత్తవీధి మండలం దారకొండ కొత్తూరు గ్రామానికి చెందిన ఎస్.నాని ప్రసాద్... ఎస్టీ పిడబ్ల్యూడి కేటగిరిలో 12వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురూ జేఈఈ అడ్వాన్స్​డ్​లో ర్యాంకులు సాధించడంపై శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ ఎల్.శివ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఇకపై రోజూ విచారణ.. అవసరమైతే ప్రత్యక్షంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.