ETV Bharat / state

విశాఖలో అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్

author img

By

Published : Jul 22, 2020, 12:08 AM IST

అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే విశాఖను సందర్శించారు. తూర్పు నౌదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్​తో సమావేశమై.. పలు అంశాలను చర్చించారు.

andaman and nicobar islands navy commander-in-chief lieutenant general
విశాఖలో అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్

అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే... తూర్పు నౌకాదళ మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పాండేతో భేటీ అయ్యారు. రెండు కమాండ్​ల మధ్య సమన్వయం, బంగాళాఖాతంలో నౌకాదళం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.

మనోజ్ పాండే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 15వ కమాండర్ ఇన్ చీఫ్​గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్​లో వాస్తవ అధీన రేఖ వద్ద ఇంజనీర్ బ్రిగేడ్​లో పాండే కీలక పాత్ర పోషించారు.

పశ్చిమ లద్దాక్​లో ఉన్నత శిఖరాల విభాగంలో ఆయన బృందాలను నడిపించడంలో విశేష కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పలు ఆపరేషన్​లలో కీలకపాత్ర నిర్వహించారు.

ప్రస్తుత జియో పొలిటికల్ పరిస్థితుల్లో అండమాన్ నికోబార్ దీవుల సముదాయం నేవీ కమాండ్, తూర్పు నౌకాదళ కమాండ్లు మధ్య పరస్పర సమన్వయం ప్రధానమైన అంశంగా మారింది. పాండేతో పాటు విశాఖను డిఫెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అర్చన పాండే సందర్శించారు.

ఇదీ చదవండి: 'మీ వినతులు బాక్సులో వేయండి ప్లీజ్'

అండమాన్ నికోబార్ దీవుల నేవీ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే... తూర్పు నౌకాదళ మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పాండేతో భేటీ అయ్యారు. రెండు కమాండ్​ల మధ్య సమన్వయం, బంగాళాఖాతంలో నౌకాదళం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.

మనోజ్ పాండే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 15వ కమాండర్ ఇన్ చీఫ్​గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్​లో వాస్తవ అధీన రేఖ వద్ద ఇంజనీర్ బ్రిగేడ్​లో పాండే కీలక పాత్ర పోషించారు.

పశ్చిమ లద్దాక్​లో ఉన్నత శిఖరాల విభాగంలో ఆయన బృందాలను నడిపించడంలో విశేష కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పలు ఆపరేషన్​లలో కీలకపాత్ర నిర్వహించారు.

ప్రస్తుత జియో పొలిటికల్ పరిస్థితుల్లో అండమాన్ నికోబార్ దీవుల సముదాయం నేవీ కమాండ్, తూర్పు నౌకాదళ కమాండ్లు మధ్య పరస్పర సమన్వయం ప్రధానమైన అంశంగా మారింది. పాండేతో పాటు విశాఖను డిఫెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అర్చన పాండే సందర్శించారు.

ఇదీ చదవండి: 'మీ వినతులు బాక్సులో వేయండి ప్లీజ్'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.