ETV Bharat / state

ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు పేరిట వైకాపా పాదయాత్ర

author img

By

Published : Nov 7, 2020, 10:20 PM IST

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 'ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు' పేరిట వైకాపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించాయి.

ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు పేరిట వైకాపా పాదయాత్ర
ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు పేరిట వైకాపా పాదయాత్ర

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 'ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు' పేరిట వైకాపా కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. టెక్కలి నియోజకవర్గ ఇన్​ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం అక్కడ నుంచి కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి, రామేశ్వరం గ్రామాల మీదుగా గుడివాడ, చిన్నసాన, పులి బంద, రామూర్తిపేట-బమ్మిడి పేట , చుట్టి గుండం, కన్నెవలస వరకు పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ వైకాపా శ్రేణులు, మహిళలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 'ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు' పేరిట వైకాపా కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. టెక్కలి నియోజకవర్గ ఇన్​ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండలం కొత్తపల్లిలో పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం అక్కడ నుంచి కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి, రామేశ్వరం గ్రామాల మీదుగా గుడివాడ, చిన్నసాన, పులి బంద, రామూర్తిపేట-బమ్మిడి పేట , చుట్టి గుండం, కన్నెవలస వరకు పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ వైకాపా శ్రేణులు, మహిళలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి : వైకాపాది ప్రజా సంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర : జనసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.