ETV Bharat / state

కత్తులతో దాడి చేసుకున్న వైకాపా వర్గీయులు... ఒకరి పరిస్థితి విషమం

author img

By

Published : Jul 21, 2020, 12:44 PM IST

శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలం కీర్తిపురంలో వైకాపా వర్గీయులు మధ్య ఘర్ణణ జరిగింది. మాటామాటా పెరిగి కత్తులతో దాడిచేసుకున్నారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ycp leaders fight each other in srikakulam dst
ycp leaders fight each other in srikakulam dst

శ్రీకాకుళం ఇచ్చాపురం మండలం కీర్తిపురంలో వైకాపా వర్గీయుల మధ్య విభేదాలు చెలరేగాయి. నాడు-నేడు, ఉపాధి హామీ పనుల కేటాయింపులో వివాదం తలెత్తింది. కీర్తిపురం ఉన్నత పాఠశాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటమాటకు పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు.

వైకాపా వర్గీయుల మధ్య చెలరేగిన ఈ ఘర్షణలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఆరుగురు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం ఇచ్చాపురం మండలం కీర్తిపురంలో వైకాపా వర్గీయుల మధ్య విభేదాలు చెలరేగాయి. నాడు-నేడు, ఉపాధి హామీ పనుల కేటాయింపులో వివాదం తలెత్తింది. కీర్తిపురం ఉన్నత పాఠశాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాటమాటకు పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారు.

వైకాపా వర్గీయుల మధ్య చెలరేగిన ఈ ఘర్షణలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఆరుగురు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.