వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. మరణంలోనూ వీరి బంధం కలిసే ఉంది. భర్త మరణించాడని తెలియగానే.. భార్య సైతం ప్రాణాలు వదలింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేటలో జరిగింది.
గ్రామానికి చెందిన డాక్టర్ సలాది రామారావు (75) గుండెపోటుతో మరణించారు. తన భర్త మరణించాడన్న విషయం తెలియగానే భార్య నిర్మల (65) సైతం ప్రాణాలు విడిచింది. దీంతో మరణంలోనూ కూడా ఇద్దరూ ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: