శ్రీకాకుళం జిల్లా గార మండలంలో విషాదం చోటుచేసుకుంది. కళింగపట్నం-మత్స్యలేశం తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన 8 మందిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాందంలో గల్లంతైన వారు ఉత్తరప్రదేశ్ అలంపూర్ జిల్లా ఈటీరాంపూర్కు చెందిన వారని తెలుస్తోంది.
గృహ నిర్మాణంలో సీలింగ్ పనులు చేసే యువకులు... పొట్టకూటికోసం పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీకాకుళానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో 8 మంది సముద్రస్నానానికి వెళ్లారు. వారిలో ఆశిష్ వర్మ (18), చోటు (18), సందీప్ (18) అనే యువకులు గల్లతయ్యారు. వారి కోసం మెరైన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:
శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు