శ్రీకాకుళం జిల్లా సోంపేట పంచాయతీ ఈవో జ్యోతీశ్వరరెడ్డిని.. కలెక్టర్ నివాస్ సస్పెండ్ చేశారు. శుక్రవారం కరోనా లక్షణాలతో మృతి చెందిన వ్యక్తిని ట్రాక్టర్పై తరలించిన ఘటనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సోంపేట తహసీల్దార్, ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొవిడ్ మృతుల తరలింపుపై స్పష్టమైన విధానాలు విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కరోనా లక్షణాలతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్పై తరలించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.
ఇదీ చూడండి..
పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య: కుమారుడు, కుమార్తె మృతదేహాలు లభ్యం