ETV Bharat / state

బయటకు వచ్చారో... పెట్రోల్ కట్ ! - narasannapeta police new technique to control vehicals

బయటకు రావొద్దు... వాహనాలపై తిరగొద్దు అని పోలీసులు ఎంత మెుత్తుకుంటున్నా... ప్రజలు బేఖాతరు చేస్తూ రోడ్లపై యధేచ్ఛగా తిరుగేస్తున్నారు. దీంతో పోలీసులు ఓ కొత్త ఉపాయం ఆలోచించారు. అలా రోడ్ల పైకి వచ్చిన వారి వాహనాలకు పెట్రోల్ బంద్ చేస్తున్నారు. అసలు ఆ విధానం ఎలా అమలు చేస్తున్నారో చూడండి.

red marks on vehicles by srikakulam police
రహదారులపైకి వస్తే ఎరుపు రంగే!
author img

By

Published : Apr 18, 2020, 2:58 AM IST

నిబంధనలు అతిక్రమిస్తే రంగు పడుద్ది అంటున్నారు పోలీసులు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా లాక్​డౌన్ అమలు చేస్తుండగా, వాహనచోదకులు అడ్డు అదుపు లేకుండా బయట తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేయటానికి పోలీసులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ప్రధాన రహదారిపై పలు వాహనాలకు ఎరుపు రంగు వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు ఇలా ఎరుపు రంగు వేయడం ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. మడపాం టోల్​గేట్ వద్దకు వచ్చిన వాహనాలును అడ్డుకోవటంతో పెద్ద ఎత్తున వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. నరసన్నపేట ఎస్సై సత్యనారాయణ, నేతృత్వంలో పోలీసులు వాహన రాకపోకలను అదుపు చేెశారు.

నిబంధనలు అతిక్రమిస్తే రంగు పడుద్ది అంటున్నారు పోలీసులు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా లాక్​డౌన్ అమలు చేస్తుండగా, వాహనచోదకులు అడ్డు అదుపు లేకుండా బయట తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేయటానికి పోలీసులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ప్రధాన రహదారిపై పలు వాహనాలకు ఎరుపు రంగు వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు ఇలా ఎరుపు రంగు వేయడం ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. మడపాం టోల్​గేట్ వద్దకు వచ్చిన వాహనాలును అడ్డుకోవటంతో పెద్ద ఎత్తున వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. నరసన్నపేట ఎస్సై సత్యనారాయణ, నేతృత్వంలో పోలీసులు వాహన రాకపోకలను అదుపు చేెశారు.

ఇదీ చదవండి: ఇళ్లకు స్టిక్కర్ అంటించేందుకు వెళ్లిన వాలంటీర్​పై దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.