ETV Bharat / state

సిరి ధాన్యాలతో... సంపూర్ణ ఆరోగ్యం

శ్రీకాకుళంలో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వాలి హాజరయ్యారు.

author img

By

Published : Jul 22, 2019, 4:21 AM IST

రైతు సదస్సు
సిరి ధాన్యాలతో కలుగుతుంది... సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్ వాలి తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళా మందిర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు సదస్సులో పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులకు.. ప్రకృతిలో లభించే పదార్థాలతో చేసే కషాయాలతో 9 నెలల్లో జబ్బు నయం అవుతుందని ఖాదర్ చెప్పారు. ప్రతీ ఒక్కరూ కషాయం, సిరిధాన్యాలను విధిగా వాడాలన్నారు. సామలు, అరికలు, కొర్రలు, ఊదలు, అండు కొర్రలు వంటిని ఆరోగ్యానికి దోహదం చేసే అద్భుతమైన ధాన్యాలని వివరించారు.

సిరి ధాన్యాలతో కలుగుతుంది... సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్ వాలి తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళా మందిర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు సదస్సులో పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులకు.. ప్రకృతిలో లభించే పదార్థాలతో చేసే కషాయాలతో 9 నెలల్లో జబ్బు నయం అవుతుందని ఖాదర్ చెప్పారు. ప్రతీ ఒక్కరూ కషాయం, సిరిధాన్యాలను విధిగా వాడాలన్నారు. సామలు, అరికలు, కొర్రలు, ఊదలు, అండు కొర్రలు వంటిని ఆరోగ్యానికి దోహదం చేసే అద్భుతమైన ధాన్యాలని వివరించారు.

ఇది కూడా చదవండి

జాతీయ రహదారిపై లారీ బోల్తా

Intro:యాంకర్ : ఆయన ఓ స్వర్ణకారుడు ....బంగారు వస్తువులు తయారు చేసుకుంటూ జీవనం సాగించే యువకుడు .... ఆయనలో ఏదో సాధించాలని తపన తన నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది . సూక్ష్మ చిత్రాలు వస్తువులు రూపొందించడంలో దిట్టగా నిలుస్తున్నారు . అతి చిన్న వస్తువులు రూపొందించడంలో లో తన నైపుణ్యం చూపుతున్నారు . పెన్సిల్ ముళ్ళు, కొబ్బరి ఈనె, బలపం వంటి వాటిని అందమైన చిత్రాలుగా తయారు చేస్తున్నారు. కంటికి కనిపించనంత చిన్న వస్తువులు రూపొందించి ఘనాపాటి గా నిర్మిస్తున్నారు. తాను భవిష్యత్తులో ఓ రికార్డు సాధించాలన్నా లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి చెందిన వీరమల్లు శివ నాగ నరసింహాచారి అనే యువకుడు స్వర్ణకార వృత్తి లో స్థిరపడ్డాడు. గత నాలుగేళ్లుగా ఆయన సూక్ష్మ చిత్రాల రూపకల్పనలో మంచి నైపుణ్యం సాధించాడు. గాంధీజీ , అబ్దుల్ కలాం , నెహ్రు , సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తి నాయక్ చిత్రాలు పలు దేవతామూర్తుల చిత్రాలు వంటివి తన నైపుణ్యంతో చిత్రీకరించాడు . తాజాగా చంద్ర యాన్ టు ప్రయోగం పురస్కరించుకొని బలపం పై 6 మిల్లీ మీటర్ల పరిమాణంలో చంద్రయాన్ రాకెట్ చిత్రాన్ని ఆవిష్కరించారు . ఈ చిత్రం నేరుగా చూడడం కంటే భూతద్దం ద్వారా చూస్తే సుందరంగా కనిపిస్తుంది. తాను తయారు చేస్తున్న సూక్ష్మ చిత్రాల ద్వారా ప్రపంచ గుర్తింపు సాధించాలన్న తపన ఉందని నరసింహాచారి తెలిపారు.


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.