Railway electric wires: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి.. రైల్వే విద్యుత్ వైర్లను పట్టుకున్నాడో యువకుడు. దీంతో.. ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో.. ప్లాట్ ఫాంపై పడ్డాడు. అక్కడే ఉన్న రైల్వే అధికారులు గమనించి 108 ద్వారా శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ షాక్ కారణంగా శరీరం కాలిపోవడంతో.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని 108 సిబ్బంది తెలిపారు. కరెంటు తీగలు పట్టుకున్న వ్యక్తిని ఎం.రామ్ కిషోర్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గోదావరి జిల్లా కొవ్వూరు మండలం రామ్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆధార్ కార్డు సహాయంతో గుర్తించినట్లు 108 సిబ్బంది తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని వారు వెల్లడించారు.
ఇదీ చదవండి: suspected death: ఇంటి నుంచి ఆటోలో వెళ్లి.. బావిలో శవమై కనిపించింది..!