ETV Bharat / state

పక్క రాష్ట్రం మెప్పు కోసమే పోలవరం ఎత్తు తగ్గింపు: కళా

author img

By

Published : Nov 17, 2020, 10:57 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేత కళా వెంకట్రావ్ అన్నారు. ఏడాదిన్నర పాలనలో రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. పక్క రాష్ట్రం మెప్పు కోసమే పోలవరం ఎత్తును తగ్గించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.

kala venkata rao
kala venkata rao

వైకాపా పాలనలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుంతుందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో మాట్లాడిన ఆయన... కాంట్రాక్ట్ పనులు రద్దు, అక్రమ కేసులు, అప్పులు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.365 జీవోతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులతో పాటు ఇతర ప్రాజెక్టు పనులు నిలిపివేయటంతో పంటలకు నీరందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పక్క రాష్ట్రం మెప్పు కోసమే పోలవరం ఎత్తును తగ్గించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

వైకాపా పాలనలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుంతుందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో మాట్లాడిన ఆయన... కాంట్రాక్ట్ పనులు రద్దు, అక్రమ కేసులు, అప్పులు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.365 జీవోతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులతో పాటు ఇతర ప్రాజెక్టు పనులు నిలిపివేయటంతో పంటలకు నీరందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పక్క రాష్ట్రం మెప్పు కోసమే పోలవరం ఎత్తును తగ్గించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.