శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో కేసులు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జె నివాస్ సూచించారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
మురికివాడలు, కంటైన్మెంట్ జోన్లలో ప్రతీ ఇంటి నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. బేల్లుపడ, రత్తకన్న, కండర వీధులలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో పరీక్షలు జరపటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి: నారాయణపురం ఆనకట్ట నుంచి సాగునీరు విడుదల