ETV Bharat / state

కరోనాపై పోరుకు.. కదిలొస్తున్న ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు

author img

By

Published : Mar 26, 2020, 9:23 AM IST

కరోనా ప్రభావాన్ని నియంత్రించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్మీ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ... వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు.

awareness on corona virus in ap state
కరోనాపై పోరుకు ప్రజా క్షేత్రంలోకి ప్రజా ప్రతినిధులు
కరోనాపై పోరుకు ప్రజా క్షేత్రంలోకి ప్రజా ప్రతినిధులు

గుంటూరులో సాల్వేషన్ ఆర్మీ ఆర్గనైజింగ్ సంస్థ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు మాస్క్ లు, శానిటేజర్లు, గ్లౌజ్ లు పంపణీ చేశారు.

కరోన కట్టడిలో భాగంగా అమలు చేసిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ రహదార్లపైకి రావద్దని... అలా ఎవరైనా వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పి.హెచ్​.సి సెంటర్లను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు గురించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కడప జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. వీధుల్లో రసాయనాలను తానే స్వయంగా పిచికారి చేశారు. అనంతరాజుపేట వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.

కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతి వ్యక్తి ఇళ్లలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పరిస్థితుల్లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ అమలు తీరును శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరిస్తున్నారని మరికొంత కాలం అలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

'సామాజిక దూరమే కరోనా వ్యాప్తికి నివారణ'

కరోనాపై పోరుకు ప్రజా క్షేత్రంలోకి ప్రజా ప్రతినిధులు

గుంటూరులో సాల్వేషన్ ఆర్మీ ఆర్గనైజింగ్ సంస్థ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులకు మాస్క్ లు, శానిటేజర్లు, గ్లౌజ్ లు పంపణీ చేశారు.

కరోన కట్టడిలో భాగంగా అమలు చేసిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమణ కుమార్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ రహదార్లపైకి రావద్దని... అలా ఎవరైనా వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో పి.హెచ్​.సి సెంటర్లను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు గురించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఎవరూ సెలవు పెట్టొద్దని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కడప జిల్లా రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. వీధుల్లో రసాయనాలను తానే స్వయంగా పిచికారి చేశారు. అనంతరాజుపేట వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.

కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతి వ్యక్తి ఇళ్లలో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నమోదు అయిన పరిస్థితుల్లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ అమలు తీరును శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరిస్తున్నారని మరికొంత కాలం అలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

'సామాజిక దూరమే కరోనా వ్యాప్తికి నివారణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.