వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు సంబంధించి నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. జిల్లాలోని 40 వేల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం సెప్టెంబరు మాసానికి సంబంధించి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు కోసం 6 కోట్ల రూపాయలను వినియోగించేందుకు పాలనా పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా ఈ వ్యవసాయ విద్యుత్ మీటర్లను ప్రభుత్వం బిగించనుంది.
ఇదీ చదవండి: