Two groups fighting: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం సికివారిపల్లి గ్రామం సప్పలమ్మ జాతరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పది మందికి గాయాలయ్యాయి. ఎడ్లబండి విషయమై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని విచక్షణారహితంగా మహిళలపై దాడి చేశారు.
Two groups fighting: ఓ సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్లలోకి ప్రవేశించి మరీ.. మహిళలని కూడా చూడకుండా కర్రలతో చితకబాదారు. మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత కక్షలే గొడవకు కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Ex-Minister Dance: యువకులతో కలిసి.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్టెప్పులు