పార్టీని వదిలి వెళ్లిన వ్యక్తికి తిరిగి పార్టీ బాధ్యతలు అప్పగించే దుస్థితిలో తెదేపా లేదని ఆ పార్టీ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మన్నె రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని సోమవారం రాత్రి స్థానిక రవీంద్ర వైద్యశాల ఆవరణలో నియోజకవర్గ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సారి స్థానికులకే పార్టీ ఇన్ఛార్జి పదవి దక్కాలన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని... దాన్ని అనుకూలంగా మార్చుకొని యర్రగొండపాలెంలో ఈ సారి టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఇదీ చదవండి: ఫసల్ బీమా అందని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ