ఆడినెల కృత్తికా నక్షత్రం సందర్భంగా ఒంగోలులో స్థిరపడిన తమిళ కుటుంబీకులు వేల్ కావడి ఉత్సవాలు భక్తిప్రపక్తులతో నిర్వహించారు. చెన్నకేశవ ఆలయంలో గణపతి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద కావడి ఉత్సవం నిర్వహించారు. భక్తులు బుగ్గల్లో బల్లేలు గుచ్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. కావడిలో పండ్లు, పాలు, విబూది, పవిత్ర ద్రవ్యాలను మోస్తూ నగరోత్సవం పాల్గొన్నారు. మయూర వాహనంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీవల్లీ దేవసేనా సమేతంగా పురవీధిల్లో భక్తులకు కనువిందు చేశారు.
ఇది కూడా చదవండి.