ప్రకాశం జిల్లా వ్యాపంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు పరీక్షలు కొనసాగుతున్నాయి. చీరాల నియోజకవర్గంలో 16 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద చీరాల ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్, అక్సోమీటర్తో ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలను ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్, చీరాల రూరల్ సీఐ రోశయ్యలు పరిశీలించారు.
ఇవీ చూడండి...