ETV Bharat / state

'కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం' - మార్టూరులో తెదేపా సమావేశం వార్తలు

ప్రకాశం జిల్లా మార్టూరులో తెదేపా సంస్థాగత సదస్సు నిర్వహించారు. స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

tdp leaders meeting
మార్టూరులో తెదేపా సమావేశం
author img

By

Published : Oct 29, 2020, 4:26 PM IST

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని తెదేపా సీనియర్ నాయకులు, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు సలగల రాజశేఖర్ బాబు, కరీముల్లా, సదాశివరావు అన్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో సంస్థాగత సదస్సు నిర్వహించారు.

మండల అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో యువతకు పెద్దపీట వేసేలా గ్రామంలో సంస్థాగత నిర్మాణం బలోపేతం కావాలన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని తెదేపా సీనియర్ నాయకులు, ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు సలగల రాజశేఖర్ బాబు, కరీముల్లా, సదాశివరావు అన్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో సంస్థాగత సదస్సు నిర్వహించారు.

మండల అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో యువతకు పెద్దపీట వేసేలా గ్రామంలో సంస్థాగత నిర్మాణం బలోపేతం కావాలన్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టిన తొలి ప్రభుత్వంగా జగన్ సర్కార్ నిలిచిపోతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.