కరోనా మహమ్మారి నుంచి ప్రజలను, పోలీసులను రక్షించేందురు అధునాతన రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తెలిపారు. ఇంకోల్లు, చినగంజాం పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలను ఆన్ లైన్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాల వల్ల ప్రజలు, పోలీసులు కొవిడ్ బారిన పడకుండా రక్షణ ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. బయట నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు, పోలీసులకు భద్రత కల్పించే విధంగా అధునాతన వసతులతో వీటి నిర్మాణం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు