ETV Bharat / state

'ఈ భోజనం మా పిల్లలకు పెట్టొద్దు..!'

author img

By

Published : Jan 5, 2020, 11:27 AM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో భోజనం దారుణంగా.. ఉందని తమ పిల్లలకు ఇలాంటి భోజనం పెట్టవద్దని పేరెంట్స్​ కమిటీ తీర్మానించింది. శనివారం సాయంత్రం సమావేశమైన కమిటీ సభ్యులు భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. అది సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి భోజనం పెట్టకపోయినా పర్వాలేదని అన్నారు. తాము చేసిన తీర్మానాలను అధికారులకు పంపనున్నట్లు కమిటీ ఛైర్మన్​ చెవుల గంగయ్య తెలిపారు.

నాణ్యత లేని భోజనం పిల్లలకు పెట్టవద్దంటూ తల్లిదండ్రుల కమిటీ తీర్మానం
నాణ్యత లేని భోజనం పిల్లలకు పెట్టవద్దంటూ తల్లిదండ్రుల కమిటీ తీర్మానం
నాణ్యత లేని భోజనం వద్దని తల్లిదండ్రుల కమిటీ తీర్మానం

నాణ్యత లేని భోజనం వద్దని తల్లిదండ్రుల కమిటీ తీర్మానం

ఇదీ చూడండి:

'ఉద్యమం చేస్తున్న రైతులంతా పెయిడ్​ ఆర్టిస్టులే'

Intro:AP_ONG_82_04_BHOJANAM_DAARUNAM_VO_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ఇంత మరీ దారుణమైన భోజనం మా పిల్లలకు వద్దంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ తీర్మానించింది. సాయంత్రం కమిటీ సమావేశమైంది. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న భోజనం దారుణంగా ఉందని....ఇలా ఐతే ఇలాంటి భోజనం పెట్టకపోయినా పర్వాలేదన్నారు. అనంతరం భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపించడం పై చేసిన తీర్మానాన్ని అధికారులకు పంపనున్నట్లు కమిటీ చైర్మన్ చెవుల గంగయ్య తెలిపారు. విద్యార్థులు మాత్రం ఈ భోజనం మాకొద్దు బాబోయ్ అని మొరపెట్టుకుంటున్నారు.


Body:భోజనం దారుణం.


Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.