పంచలోహ విగ్రహాల చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు ప్రకాశం జిల్లా కొరశపాడుకు చెందిన మల్లిఖార్జునరావు, ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజేశ్, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన హిదామ్ తుల్లా, కృష్ణా జిల్లా రెడ్డిగూడానికి మరో వ్యక్తి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్రకాశం జిల్లా కొరశపాడు మండలం తుమ్మవరం గ్రామంలోని కాశీవిశ్వేశ్వర స్వామి శివాలయంలో అమ్మవారి పంచలోహ విగ్రహం, రాచపూడి గ్రామం చిదంబదేశ్వరస్వామి దేవాలయంలో వీరభధ్రుడు పంచలోహ విగ్రహం దొంగిలించారు. ఈ రెండు విగ్రహాలూ 12వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల కాలం నాటివి. విగ్రహాలను అమ్మేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఒంగోలులోని సంఘమిత్ర ఆస్పత్రి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పంచలోహ విగ్రహాలతో పాటు మూడు ఉత్సవ మూర్తులను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు.
ఇదీ చదవండి:
తణుకులో పంచలోహ విగ్రహం అపహరణ