ETV Bharat / state

'అన్నిశాఖల అధికారుల మధ్య సమన్వయం కీలకం' - cheerala mla review meeting news

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయం ఎంతో అవసరమని చీరాల ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి అన్నారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు.

అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
author img

By

Published : Apr 2, 2020, 8:31 PM IST

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే కోరారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్యం పనుల గురించి కమిషనర్ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే బలరాంకు వివరించారు.

చీరాల ఏరియా వైద్యశాల, స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్ వార్డుల గురించి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్​ నుంచి వివరాలు తెలుసుకున్నారు. లాక్​డౌన్​ సందర్భంగా పట్టణంలో తీసుకుంటున్న ఆంక్షల గురించి చీరాల సీఐలు ఎన్. నాగమల్లీశ్వరరావు, ఫిరోజ్​లు వివరించారు. ప్రజల్లో అవగాహన కలిపిస్తున్న పోలీస్, వైద్య, మున్సిపల్, మీడియాను ఎమ్మెల్యే అభినందించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్యే కోరారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటంతో వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్యం పనుల గురించి కమిషనర్ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే బలరాంకు వివరించారు.

చీరాల ఏరియా వైద్యశాల, స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో క్వారంటైన్ వార్డుల గురించి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్​ నుంచి వివరాలు తెలుసుకున్నారు. లాక్​డౌన్​ సందర్భంగా పట్టణంలో తీసుకుంటున్న ఆంక్షల గురించి చీరాల సీఐలు ఎన్. నాగమల్లీశ్వరరావు, ఫిరోజ్​లు వివరించారు. ప్రజల్లో అవగాహన కలిపిస్తున్న పోలీస్, వైద్య, మున్సిపల్, మీడియాను ఎమ్మెల్యే అభినందించారు.

ఇదీ చూడండి:

'చిన్న పిల్లల్లో ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.