ETV Bharat / state

'అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి'

author img

By

Published : Apr 7, 2020, 10:44 AM IST

కరోనాపై ముందస్తు చర్యల్లో భాగంగా అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టాస్క్​ఫోర్స్​ కమిటీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంగా కలిసి పని చేయాలని సూచించారు.

టాస్క్​ఫోర్స్​ కమిటీ సభ్యులతో అద్దంకి ఎమ్మెల్యే సమావేశం
టాస్క్​ఫోర్స్​ కమిటీ సభ్యులతో అద్దంకి ఎమ్మెల్యే సమావేశం

ప్రకాశం జిల్లా అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ టాస్క్​ఫోర్స్​ కమిటీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందికి మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంగా కలిసి పనిచేయాలన్నారు. ఇంత వరకు నియోజకవర్గంలో పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. క్వారంటైన్​లో ఉన్న ప్రజలకు అవసరమైన భోజనం, వసతి, పారిశుద్ధ్యం లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

ప్రకాశం జిల్లా అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ టాస్క్​ఫోర్స్​ కమిటీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందికి మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంగా కలిసి పనిచేయాలన్నారు. ఇంత వరకు నియోజకవర్గంలో పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. క్వారంటైన్​లో ఉన్న ప్రజలకు అవసరమైన భోజనం, వసతి, పారిశుద్ధ్యం లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.