ETV Bharat / state

మృత్యువు ఓడించినా ప్రతిభ గెలిపించింది - markapuram chennakesavalu death in road accident

తమ కలలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. తమ కష్టాలు తీర్చి ఆనందంగా చూసుకుంటారని కలలు కంటారు. కానీ ఆ తల్లిదండ్రులపై విధి పగబట్టింది. చేతికి వచ్చిన కొడుకును మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది. అయితే కొడుకు ప్రతిభకు నాగార్జున వర్సిటీ బంగారు పతకాలను అందించింది. కన్న కొడుకు లేకపోవడం వల్ల ఆ తండ్రే వాటిని అందుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సన్నివేశాన్ని చూసి అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

అవార్డుల అందుకోకుండానే.... అనంతలోకాలకు
అవార్డుల అందుకోకుండానే.... అనంతలోకాలకు
author img

By

Published : Feb 28, 2020, 10:08 PM IST

అవార్డుల అందుకోకుండానే.... అనంతలోకాలకు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటోన్న తిరుపాలు, లక్ష్మమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఏడుగురు ఆడపిల్లలు కాగా.. ఒక్కగానొక్క కుమారుడు చెన్నకేశవులు. తండ్రి కష్టపడి పూల వ్యాపారం చేస్తూ కేశవులను చదివించాడు. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని చూపించి, తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని కలలు కనేవాడు కేశవులు. చిన్న వయస్సు నుంచి బాధ్యతగా ఉంటూ చదువులో రాణించాడు.

రోడ్డు ప్రమాదంలో కేశవులు మరణం

మార్కాపురంలోనే డిగ్రీ చదివిన చెన్నకేశవులు... అనంతరం నాగార్జున వర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, పబ్లిక్ రిలేషన్స్​లో పీహెచ్​డీ సీటు సాధించాడు. అనేక అంశాల్లో పరీక్షలు రాసి, క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి త్వరలోనే స్థిరపడతాడనుకునేలోపే విషాదం జరిగింది. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు మృతి చెందాడు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కలలుగానే మిగిలిపోయాయి. స్నేహితుల ఆశలు ఆవిరయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారుని మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లి లక్ష్మమ్మ తీవ్ర మనోవేదనతో మూడు నెలల వ్యవధిలోనే కన్నుమూసింది. ఒక్కగానొక్క కుమారుడు, జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యను కోల్పోవడం వల్ల తండ్రి తిరుపాలు ఆవేదన వర్ణనాతీతం.

ఐదు బంగారు పతకాలు

చెన్నకేశవులు పీజీ, పీహెచ్​డీల్లో సమర్పించిన పరిశోధన పత్రాలకు విశ్వవిద్యాలయం ఐదు బంగారు పతకాలను ప్రకటించింది. గురువారం జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో చెన్నకేశవులు తరఫున తండ్రి తిరుపాలు వాటిని అందుకున్నాడు. కుమారుడు సాధించిన విజయాలకు ఆ తండ్రి మురిసిపోయాడు. అయితే కళ్ల ముందు కన్నకొడుకు లేకపోవడం, ఆ బంగారు పతకాలు తాను తీసుకోవాల్సి రావటంతో తిరుపాలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సన్నివేశాన్ని చూసిన సహచర విద్యార్థులు, స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

వాడిన పూలతో అగర్‌ బత్తీలు..

అవార్డుల అందుకోకుండానే.... అనంతలోకాలకు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటోన్న తిరుపాలు, లక్ష్మమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఏడుగురు ఆడపిల్లలు కాగా.. ఒక్కగానొక్క కుమారుడు చెన్నకేశవులు. తండ్రి కష్టపడి పూల వ్యాపారం చేస్తూ కేశవులను చదివించాడు. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని చూపించి, తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని కలలు కనేవాడు కేశవులు. చిన్న వయస్సు నుంచి బాధ్యతగా ఉంటూ చదువులో రాణించాడు.

రోడ్డు ప్రమాదంలో కేశవులు మరణం

మార్కాపురంలోనే డిగ్రీ చదివిన చెన్నకేశవులు... అనంతరం నాగార్జున వర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, పబ్లిక్ రిలేషన్స్​లో పీహెచ్​డీ సీటు సాధించాడు. అనేక అంశాల్లో పరీక్షలు రాసి, క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి త్వరలోనే స్థిరపడతాడనుకునేలోపే విషాదం జరిగింది. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు మృతి చెందాడు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కలలుగానే మిగిలిపోయాయి. స్నేహితుల ఆశలు ఆవిరయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారుని మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తల్లి లక్ష్మమ్మ తీవ్ర మనోవేదనతో మూడు నెలల వ్యవధిలోనే కన్నుమూసింది. ఒక్కగానొక్క కుమారుడు, జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్యను కోల్పోవడం వల్ల తండ్రి తిరుపాలు ఆవేదన వర్ణనాతీతం.

ఐదు బంగారు పతకాలు

చెన్నకేశవులు పీజీ, పీహెచ్​డీల్లో సమర్పించిన పరిశోధన పత్రాలకు విశ్వవిద్యాలయం ఐదు బంగారు పతకాలను ప్రకటించింది. గురువారం జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో చెన్నకేశవులు తరఫున తండ్రి తిరుపాలు వాటిని అందుకున్నాడు. కుమారుడు సాధించిన విజయాలకు ఆ తండ్రి మురిసిపోయాడు. అయితే కళ్ల ముందు కన్నకొడుకు లేకపోవడం, ఆ బంగారు పతకాలు తాను తీసుకోవాల్సి రావటంతో తిరుపాలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సన్నివేశాన్ని చూసిన సహచర విద్యార్థులు, స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

వాడిన పూలతో అగర్‌ బత్తీలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.